చైనాకు నేవల్ ఎక్సర్సైజ్ల ద్వారా భారత్ గట్టి షాక్
By: chandrasekar Tue, 21 July 2020 12:29 PM
భారత్-చైనా సైనికుల మధ్య
ఘర్షణల అనంతరం భారత్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. సరిహద్దుల్లో
భారత సేనల దూకుడు పెరిగింది. చైనాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ప్రతీకార
ధోరణి తెలుస్తున్నది. ముఖ్యంగా గల్వాన్ ఘటన తర్వాత అంతర్జాతీయంగా చైనాకు
వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో భారత్ చేసే అన్ని ప్రయత్నాలు
ఫలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేలా త్వరలో అమెరికాతో
కలిసి అండమాన్, నికోబార్ దీవుల్లో నావికా విన్యాసాలు నిర్వహించడానికి
సిద్ధమయ్యింది.
ఈ ఏడాది చివరలో జరుగబోయే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత్ మద్దతు కోసం ఎదురుచూస్తున్న ట్రంప్ కూడా భారత్తో
సంయుక్త నావికా విన్యాసాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అమెరికాకు చెందిన
యుద్ధనౌక USS నిమిట్జ్ భారత జలాల్లోకి ప్రవేశించింది. అమెరికాకు
చెందిన యుద్ధనౌక USS నిమిట్జ్తో కలిసి భారత యుద్ధ నౌకలు నేవల్ ఎక్స్ర్సైజ్లలో
పాల్గొననున్నాయి. వాణిజ్య ప్రయోజనాల కోణంలో అమెరికాను మచ్చిక చేసుకుని తద్వారా
భారత్ను ఇరుకునపెట్టాలని భావిస్తున్న చైనాకు నేవల్ ఎక్సర్సైజ్ల ద్వారా భారత్
గట్టి షాక్ ఇచ్చినట్లవుతుంది.
భారత్, అమెరికా
నావికా విన్యాసాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ విన్యాసాల ద్వారా తమ సైనిక సైనిక సామర్థ్యాలను
చైనాకు గుర్తుచేసినట్లవుతుందని ఇరుదేశాలు భావిస్తున్నాయి. కాగా, ఇరుదేశాల
యుద్ధ నౌకలు అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించబోతున్న నేవల్ ఎక్సర్సైజ్లకు
పాసెక్స్ అనే పేరు పెట్టారు. జూలై 22న నిర్వహించనున్న ఈ విన్యాసాల కోసం అమెరికా యుద్దనౌక
USS నిమిట్జ్
ఇప్పటికే అండమాన్, నికోబార్ దీవులకు చేరుకుంది. దాదాపు 1,00,000 టన్నుల బరువుండే ఈ నౌకకు 90 యుద్ధ విమానాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్నది.
ఈ విన్యాసాల్లో పాల్గొనడం కోసం మరో యుద్ధనౌక USS
రోనాల్డ్ రీగన్ కూడా ఇప్పటికే భారత్కు బయలుదేరింది.