దేశంలో ఊహకు అందని స్థాయిలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
By: Sankar Mon, 07 Sept 2020 11:51 AM
భారత్లో కరోనా కొత్త రికార్డులు నమోదు చేస్తూనే ఉంది..రోజు రోజుకి తన రికార్డును తానే అధిగమించుకుంటూ వెళ్తుంది..ఇప్పటికే 90 వేలకు పైగా కేసులు నమోదు చేసిన ఇండియా తాజాగా ఆ రికార్డు ను అధిగమించి 91 వేలకు దిశగా పరుగులు పెడుతుంది..
కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 90,802 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... 1,016 మంది మృతిచెందారు. మరోవైపు.. 42 లక్షల మార్క్ను కూడా క్రాస్ చేసింది భారత్.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 42,04,614కు చేరుకోగా... మృతుల సంఖ్య 71,642కు పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,82,542 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్రం పేర్కొంది.
మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి కోలుకున్నవారి సంఖ్య 32,50,429కు పెరిగింది. ఇక, ఆదివారం రోజు దేశవ్యాప్తంగా 7,20,362 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది... ఇప్పటి వరకు 4,95,51,507 కరోనా టెస్ట్లు చేసినట్టు వెల్లడించింది.