దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !
By: Sankar Fri, 30 Oct 2020 10:24 AM
భారత్లో గడిచిన 24 గంటల్లో 48,648 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,88,851కి చేరింది. నిన్న ఒక్క రోజే 563 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,21,090 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 57,386 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 73,73,375 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,94,386గా ఉంది..
కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,64,648 శాంపిళ్లను పరీక్షించామని, ఇప్పటివరకు 10,77,28,088 శాంపిళ్లను పరీక్షించామని ఐసీఎమ్ఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) తెలిపింది..
Tags :
india |
reports |
48648 |