భారత్ లో నిలకడగా కరోనా పాజిటివ్ కేసులు
By: Sankar Sun, 01 Nov 2020 12:09 PM
భారత్లో గడిచిన 24 గంటల్లో 46,963 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,84,082కు చేరింది.
నిన్న ఒక్క రోజే 470 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,22,111 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 58,684 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 74,91,513మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,70,458గా ఉంది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 91.54 శాతంగానూ.. నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 6.97 శాతంగా ఉంది. మరణాల రేటు 1.49 శాతానికి తగ్గింది.
Tags :
india |
reports |
46963 |