Advertisement

భారత్ లో ఆగని కరోనా ఉదృతి ...

By: Sankar Mon, 09 Nov 2020 1:25 PM

భారత్ లో ఆగని కరోనా ఉదృతి ...

భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 45,903 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,53,657 కు చేరింది.

ఇందులో 79,17,373 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,09,673 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 490 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో కరోనాతో మరణించినవారి సంఖ్య 1,26,611 చేరింది. 24 గంటల్లో ఇండియాలో 48.405 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 92.56 శాతంగా ఉండగా… మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 5.96 శాతంగా ఉంది. అలాగే మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.48 శాతంగా నమోదయ్యింది.

Tags :
|
|

Advertisement