Advertisement

దేశంలో తాజాగా 402 కరోనా మరణాలు

By: Sankar Wed, 09 Dec 2020 11:56 AM

దేశంలో తాజాగా 402 కరోనా మరణాలు


ఇండియాలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది ...గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గిన్నప్పటికీ గత 24 గంటల్లో మాత్రం కరోనా కేసులు అధికంగా నమోదు అయ్యాయి...

ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,080 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,35,850 కి చేరింది. ఇందులో 92,15,581 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,78,909 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 402 మంది కరోనాతో మృతిచెందారు..

దీంతో ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 1,41,360 కరోనా మరణాలు సంభవించాయి. ఇక గత 24 గంటల్లో 36, 635 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీనితో దేశంలో ఇప్పటివరకు 97 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి

Tags :
|
|

Advertisement