Advertisement

  • ఇండియాలో కొద్దిగా తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు

ఇండియాలో కొద్దిగా తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Fri, 11 Dec 2020 09:52 AM

ఇండియాలో కొద్దిగా తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు


ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి...తాజాగా 29,398 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 97,96,770 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇందులో 92,90,834 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,63,749 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 414 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇండియాలో మొత్తం ఇప్పటి వరకు 1,42,186 కరోనా మరణాలు సంభవించాయి.

ఇక మహారాష్ట్రలో బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 3,824 పాజిటివ్‌ కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,68,172కు, మరణాల సంఖ్య 47,972కు పెరిగింది..మరోవైపు గత 24 గంటల్లో 5,008 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 17,47,199కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది

Tags :
|
|

Advertisement