Advertisement

దేశంలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు ..

By: Sankar Mon, 14 Dec 2020 11:13 AM

దేశంలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు ..


ఇండియాలో కరోనా కేసులు కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి...అయితే కేసులు సంఖ్య తగ్గుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో కేసులు పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

అయితే ఇండియాలో తాజాగా 27,071 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 98,84,100 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 93,88,159 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,52,586 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 336 మంది కరోనాతో మృతి చెందారు.

దీంతో ఇండియాలో మొత్తం ఇప్పటి వరకు 1,43,355 కరోనా మరణాలు సంభవించాయి. అయితే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 8,55,157 కరోనా పరీక్షలు నిర్వహించారు.

Tags :
|
|

Advertisement