ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
By: Sankar Sun, 20 Dec 2020 12:01 PM
ఇండియాలో కరోనా కేసులు నిలకడగా నమోదు అయితున్నాయి ..దాదాపు ఏడాదిగా నమోదు అయితున్న కరోనా పాజిటివ్ కేసులు ప్రస్తుతం కోటి దాటాయి..అమెరికా తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశం ఇండియానే.
ఇండియాలో గత కొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నాయి. గతంలో 90 వేల వరకు నమోదు కాగా ఇప్పుడు 30 వేలకు దిగుగునా నమోదవుతున్నాయి. దేశంలో తాజాగా 26,624 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,31,223కి చేరింది.
ఇందులో 95,80,402 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,05,344 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 341 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 1,45,477 మంది మృతి చెందారు.
Tags :
india |
reports |
26624 |