Advertisement

  • దేశంలో 25 కు పెరిగిన కొత్త వైరస్ పాజిటివ్ కేసులు

దేశంలో 25 కు పెరిగిన కొత్త వైరస్ పాజిటివ్ కేసులు

By: Sankar Thu, 31 Dec 2020 11:31 AM

దేశంలో 25 కు పెరిగిన కొత్త వైరస్ పాజిటివ్ కేసులు


దేశంలో యూకే వేరియంట్ క‌రోనా కేసుల సంఖ్య 25కి చేరింది. తాజాగా మ‌రో అయిదు పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఆ కేసుల‌ను నిర్ధారించారు.

పూణెలోని వైరాల‌జీ ఇన్స్‌టిట్యూట్‌లో కొత్త నాలుగు కేసులు, ఢిల్లీలోని ఐజీఐబీలో మ‌రో కేసు న‌మోదు అయ్యింది. అయితే యూకే వేరియంట్‌లో పాజిటివ్ తేలిన 25 మందిని ఐసోలేష‌న్‌లో ఉంచిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. మ‌రో వైపు గ‌త 24 గంట‌ల్లో 21,822 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి

ఇక బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా వైరస్‌ వేరియంట్‌ కొత్త కేసులు ఇప్పుడు అమెరికాలో కూడా బయటపడుతున్నాయి. కాలిఫోర్నియా నగరంలో రెండో కేసును నమోదైంది. ఈ విసయాన్ని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించింది.తొలి కేసు మంగళవారం కొలరాడోలో బయటపడింది. 24 గంటల తర్వాత కాలిఫోర్నియాలో నమోదైనట్లు ప్రకటన వచ్చింది. తొలి కేసుగా నమోదైన వ్యక్తిని కొలరాడో నేషనల్ గార్డ్స్‌మన్‌గా గుర్తించారు.

Tags :
|
|

Advertisement