Advertisement

  • దేశంలో కోటికి చేరువవుతున్న కరోనా పాజిటివ్ కేసులు ...

దేశంలో కోటికి చేరువవుతున్న కరోనా పాజిటివ్ కేసులు ...

By: Sankar Thu, 17 Dec 2020 11:18 AM

దేశంలో కోటికి చేరువవుతున్న కరోనా పాజిటివ్ కేసులు ...


దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 24,010 కరోనా వైరస్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 99,56,558కు చేరింది.

అదే విధంగా గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్‌తో 355 మంది మృతి చెందారు. ఈ మేరకు గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి వివిధ ఆస్పత్రుల ద్వారా కోలుకొని డిశ్చార్జ్‌ అయిన వారి మొత్తం సంఖ్య 94,89,740గా ఉంది.

ఇప్పటివరకు మొత్తం కోవిడ్‌ మృతుల సంఖ్య 1,44,451కు చేరింది. ప్రస్తుతం దేశంలో దేశంలో 3,22,366 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.అయితే కరోనా గత కొంతకాలంగా తగ్గుముఖం పట్టింది...అయితే వచ్చే కొద్దీ రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో కరోనా కేసులు పెరుగుతాయని నిపుణులు యెచ్చరిస్తున్నారు...

Tags :
|
|

Advertisement