Advertisement

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

By: Sankar Tue, 15 Dec 2020 12:22 PM

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు


ఇండియాలో గత కొంతకాలంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి..ఒకానొక దశలో రోజులు లక్ష కేసుల దగ్గరకు చేరువ అయినప్పటికీ ప్రస్తుతం ఇరవై వేలకు దగ్గర్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితున్నాయి... తాజాగా ఇండియాలో 22,065 కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 99,06,165కి చేరింది. ఇందులో 94,22,636 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,39,820 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 354 మంది మృతి చెందగా, దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,43,709కి చేరింది.

ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. గతంలో రెండు వేలకు పైగా నమోదైన కేసులు ఇప్పుడు ఐదు వందల లోపే నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,599కి చేరింది

Tags :
|
|

Advertisement