Advertisement

దేశంలో కొత్తగా 20021 కొత్త కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Mon, 28 Dec 2020 11:28 AM

దేశంలో కొత్తగా 20021 కొత్త కరోనా పాజిటివ్ కేసులు


దేశంలో కరోనా కేసులు ఇంతకుముందుతో పోలుచుకుంటే తక్కువగానే నమోదు అయితున్నప్పటికీ కొత్త వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు...ఇక ఇండియాలో తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,021 కోవిడ్ పాజిటివ్ కొత్త కేసులు నమోదు అయ్యాయి ..

ఇక 21,131 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో 279 కోవిడ్‌తో మృతిచెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.02 కోట్ల మార్క్‌ను కూడా క్రాస్ చేసి.. 1,02,07,871కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 97,82,669కు పెరిగింది..

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,47,901 మంది కరోనాతో మృతిచెందగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,77,301 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు.. ఆదివారం రోజు దేశవ్యాప్తంగా 7,15,397 శాంపిల్స్ పీరక్షించామని.. ఇప్పటి వరకు 16,88,18,054 కోవిడ్ టెస్ట్‌లు చేశామని ఐసీఎంఆర్ ప్రకటించింది.

Tags :
|
|

Advertisement