దేశంలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు ...
By: Sankar Sun, 27 Dec 2020 1:01 PM
భారత్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ తగ్గింది... మరోసారి రోజువారి కేసుల సంఖ్య 20 వేల దిగువకు చేరుకుంది... భారత ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,732 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి...
ఇదే సమయంలో 21,430 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, 279 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. దీంతో... కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,87,850కు చేరోకోగా... 97,61,538 మంది కోవిడ్ బారినపడి కోలుకున్నారు..
ఇప్పటి వరకు కరోనాతో 1,47,622 మంది మృతిచెందారు.. ప్రస్తుతం దేశ్యాప్తంగా కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2,78,690గా ఉన్నట్టు కరోనా బులెటిన్లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.
Tags :
india |
reports |
18732 |