Advertisement

  • దేశంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు ..28 లక్షలకు చేరిన మొత్తం కేసులు

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు ..28 లక్షలకు చేరిన మొత్తం కేసులు

By: Sankar Fri, 21 Aug 2020 04:29 AM

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు ..28 లక్షలకు చేరిన మొత్తం కేసులు


దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతూనే ఉంది ..రోజు రోజుకి రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితున్నాయ్.. భారత్‌లో గురువారం రికార్డు స్థాయిలో 69,652 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 28,36,925కు చేరుకుంది. గత 24 గంటల్లో 58,794 మంది కోలుకోగా, 977 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 53,866కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,96,664కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,86,395 గా ఉంది.

గడచిన 24 గంటల్లో 9,18,470 శాంపిళ్లను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకూ ఒక్క రోజులో జరిపిన అత్యధిక పరీక్షల సంఖ్య ఇదే కావడం గమనార్హం. ఈ సంఖ్యను 10లక్షలకు తీసుకెళ్లడమే లక్ష్యమని కేంద్రం చెబుతోంది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,26,61,252కు చేరింది. పరీక్షల్లో వస్తున్న పాజిటివిటీ రేటు 8% కంటే తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో టెస్ట్స్‌ పర్‌ మిలియన్‌ 23,668కి చేరినట్లు చెప్పింది.

దేశంలో కరోనా రికవరీ రేటు 73.91 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్‌ కేసుల్లో కేవలం 0.28 శాతం కేసులు మాత్రమే వెంటిలేటర్‌ వరకూ వెళుతున్నాయని వెల్లడించింది. ఐసీయూలో 1.92 శాతం కేసులు ఉన్నాయని, ఆక్సిజన్‌ సపోర్ట్‌ మీద 2.62 శాతం ఉన్నాయని చెప్పింది. మరణాల రేటు 1.90 శాతానికి పడిపోయిందని తెలిపింది. తాజా 977 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 346 మంది మరణించారు.

Tags :
|
|

Advertisement