దేశంలో భారీగా కరోనా కేసులు ..30వేలకు చేరువలో ఒక్క రోజు కరోనా కేసులు
By: Sankar Sun, 12 July 2020 6:41 PM
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కొవిడ్ విలయతాండవానికి దేశ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,637 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 551 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,553కు చేరగా, ఇందులో యాక్టివ్ కేసులు 2,92,258. ఈ వైరస్ నుంచి 5,34,621 మంది కోలుకున్నారు. కాగా ఇప్పటి వరకు కరోనాతో 22,674 మంది చనిపోయారు
దేశంలోనే మహారాష్ట్ర లో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర లో 2,46,600 పాజిటివ్ కేసులునమోదు అయ్యాయి .. ఇక తమిళనాడులో 1,34,226 కేసులతో రెండవ స్థానంలో ఉంది.. ఢిల్లీలో 1,10,921 పాజిటివ్ కేసులతో మూడవ స్థానంలో ఉంది.. .