కరోనా కేసుల్లో ఏడో స్థానానికి చేరిన భారత్
By: chandrasekar Tue, 02 June 2020 4:43 PM
భారత్లో కరోనా మహమ్మారి
విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. కేసుల నమోదులో రోజురోజుకూ కొత్త రికార్డులు
నమోదవుతూనే ఉన్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24
గంటల్లో కొత్తగా 8,380 వైరస్ కేసులు నమోదయ్యాయి.
24 గంటల లో ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా
ఉన్న దేశాల జాబితాలో భారత్ 190,609 కేసులతో ఏడో
స్థానంలో నిలిచింది. తొలి ఆరు స్థానాల్లో
వరుసగా అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, బ్రిటన్, ఇటలీ దేశాలు ఉన్నాయి.
ఈ వివరాల్ని ప్రపంచ
ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో
వెల్లడించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 65,168 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Tags :
india |
ranked |
seventh |
corona |