ప్రపంచవ్యాప్తంగా 10 స్థానానికి భారత్
By: chandrasekar Mon, 25 May 2020 12:01 PM
ప్రపంచవ్యాప్తంగా కరోనా
వైరస్ పాజిటివ్ కేసుల నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ 10వ స్థానానికి చేరింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం
వరకు గడచిన 24
గంటల్లో దేశవ్యాప్తంగా 6,566 కొత్త
కేసులు నమోదయ్యాయి. గంటలకు సగటును 282
కేసులు నిర్ధారణ అవుతున్నాయి. పాజిటివ్ కేసుల వరుసగా నాలుగు రోజు 6వేలు దాటడం గమనార్హం. దేశవ్యాప్తంగా కరోనాతో మరో 153 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కోవిడ్-19 మరణాలు 4,053కి
చేరాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 138,536 చేరగా వీరిలో ఇప్పటి వరకూ 57,692 మంది కోలుకున్నారు. మరో 76,811 మందికి చికిత్స పొందుతున్నారు.
ఒక్క ముంబయిలోనే 30వేల కేసులు నమోదుకావడం గమనార్హం. మహారాష్ట్రలో రోజు
రోజుకూ అధికమవుతున్న కరోనా కేసులు. ఆదివారం ఏకంగా 3,041 కొత్త కేసులు నమోదుకాగా ముంబయిలో అత్యధికంగా 1,725 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో
అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 50వేల
మార్క్ దాటింది. బెంగాల్లోనూ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అక్కడ గడచిన 24 గంటల్లో 208
మందికి వైరస్ నిర్ధారణ కాగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,667కి ఎగబాకింది. మే 10 తర్వాత ఒక్క రోజు ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు
నమోదుకావడం ఇదే తొలిసారి.
దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ముందు
రోజుతో పోలిస్తే పాజిటివ్ కేసులు కొంచెం తక్కువగానే నమోదయ్యాయి. తమిళనాడులో
మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు పాజిటివ్ కేసుల నమోదు 700 దాటింది. అయితే, మే 1 తర్వాత తమిళనాడులో కోలుకున్నవారి సంఖ్య తగ్గడం
సానుకూలం. తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య 16,200 దాటగా ఒక్క చైన్నై నగరంలోనే పాజిటివ్ కేసులు 10వేలు దాటింది. గుజరాత్లో కోవిడ్-19 కేసుల సంఖ్య 14వేల
మార్క్ దాటింది. మహారాష్ట్ర, తమిళనాడు
తర్వాత అత్యధిక కేసులు ఇక్కడే నమోదయ్యాయి. మరణాల్లో మాత్రం దేశంలోనే రెండో
స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ 858 మంది
కరోనాతో చనిపోయారు. ఇక్కడ మరణాల రేటు 6.1
శాతంగా నమోదయ్యింది.
ఆదివారం ఢిల్లీలో కొత్తగా
508 మందికి వైరస్ నిర్ధారణ కాగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత పెద్ద సంఖ్యలో ఒక్క
రోజు కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. వలస కార్మికుల రాకతో పలు రాష్ట్రాల్లో
పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రాజస్థాన్లో 286, ఉత్తరప్రదేశ్ 254, మధ్యప్రదేశ్
219,
బీహార్ 180, ఒడిశాలో
66 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒడిశాలోని ఇప్పటి
వరకూ కరోనా వైరస్ కేసు నమోదుకాని బారిగఢ్ జిల్లాల్లో తొలిసారి ఓ కేసు నమోదయ్యింది.
రానున్న రోజుల్లో కరోనా వైరస్ ప్రభావం పెను భూతంగా మారనుంది.