Advertisement

  • దేశంలో కరోనా ఎప్పుడు తగ్గుతదో చెప్పిన ఇండియా ఔట్ బ్రేక్ సర్వే

దేశంలో కరోనా ఎప్పుడు తగ్గుతదో చెప్పిన ఇండియా ఔట్ బ్రేక్ సర్వే

By: Sankar Fri, 21 Aug 2020 10:59 AM

దేశంలో కరోనా ఎప్పుడు తగ్గుతదో చెప్పిన  ఇండియా ఔట్ బ్రేక్  సర్వే


దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మొదలు అయి దాదాపు అయిదు నెలలు పైనే అవుతున్న ఇంతవరకు తగ్గకపోగా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది..అసలు ఎప్పుడు తగ్గుతదో కూడా తెలీక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇండియా ఔట్ బ్రేక్ విడుదల చేసిన నివేదిక కొంత ఊరట కలిగించేలా ఉంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు 29 లక్షలు దాటగా, మహమ్మారి నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుంది? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే ఆందోళన ప్రజల్లో నెలకుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3 నాటికి భారత్‌లో వైరస్ తిరోగమన దశలో ఉంటుందని ఐఓఆర్ నివేదిక వెల్లడించింది.

సెప్టెంబర్ తొలివారానికి కేసుల పెరుగుదల గరిష్ణానికి చేరుతుందని అంచనా వేసింది. ఆ సమయానికి యాక్టివ్ కేసుల సంఖ్య 7.80 లక్షలుగా ఉంటాయని, ఆ తరువాత వైరస్ తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. సెప్టెంబర్ తొలి రెండు వారాల్లో వైరస్ తీవ్ర స్థాయిలో ఉంటుందని, ఆ తరువాత మరో 15 రోజులకు హాట్‌స్పాట్స్‌లోనూ తగ్గుముఖం ప్రారంభమవుతుందని పేర్కొంది. తొలినాళ్లలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కేసుల సంఖ్య ప్రస్తుతం తగ్గిన నేపథ్యంలో, ఐఓఆర్ అంచనాలపై ఆశలను పెంచుతున్నాయి.

వైరస్ ఎదుర్కునే శక్తి భారతీయుల్లో పెరుగుతోందని, నవంబర్ నాటికి ముంబయి కరోనా నుంచి బయట పడవచ్చని, అక్టోబర్ చివరి నుంచి చెన్నైలో వ్యాధి తగ్గుముఖం పడుతుందని ఈ తాజా నివేదిక వివరించింది. ఆగస్టు నెలాఖరుకు బెంగళూరులో కేసులు గరిష్ఠానికి చేరుకుంటాయని, ఆపై నవంబరు రెండో వారం తరువాత తగ్గుముఖం పడతాయని పేర్కొంది. మహా నగరాల్లో కేసుల సంఖ్య తగ్గుతూ, పట్టణాలు, గ్రామాల్లో పెరుగుతున్నందున, ఇకపై మధ్య, చిన్న శ్రేణి పట్టణాలపై ప్రభుత్వాలు దృష్టిని సారించాలని సూచించింది.

ఇండోర్, థానే, తిరువనంతపురం, సూరత్, జైపూర్, నాసిక్ వంటి టైర్-2, 3 నగరాల్లో ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతోందని గుర్తు చేసిన ఐఓఆర్ నివేదిక, నవంబరు మూడో వారం నుంచి ఈ ప్రాంతాల్లో కూడా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని తెలిపింది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తున్న రేటు కూడా తగ్గుతోందని గుర్తు చేసింది

Tags :

Advertisement