ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో భారత్ శుభారంభం...
By: chandrasekar Fri, 04 Dec 2020 7:14 PM
టీమిండియా ఆస్ట్రేలియా
గడ్డపై వన్డే సిరీస్ని కోల్పోయింది... కానీ, టీ20 సిరీస్ని మాత్రం ఘనంగా ఆరంభించింది. కాన్బెర్రా
వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో కేఎల్ రాహుల్ (51: 40 బంతుల్లో 5x4, 1x6), రవీంద్ర జడేజా (44 నాటౌట్: 23 బంతుల్లో 5x4,
1x6) నిలకడగా ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 7
వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
అనంతరం బౌలింగ్లో
చెలరేగిన చాహల్ (3/25), నటరాజన్ (3/30)..
ఛేదనలో ఆస్ట్రేలియాని 150/7కే పరిమితం చేసింది.
దాంతో.. 11
పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా.. మూడు టీ20ల
సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20
మ్యాచ్ సిడ్నీ వేదికగా ఆదివారం జరగనుంది.
162 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియాకి ఓపెనర్లు అరోన్
ఫించ్ (35: 26 బంతుల్లో 5x4, 1x6), డీఆర్క్ షార్ట్ (34:
38 బంతుల్లో 3x4)
మెరుగుగా ప్రారంభించారు. తొలి వికెట్కి 7.4
ఓవర్లలో 56
పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పిన ఈ జోడీని.. ఫించ్ను ఔట్ చేయడం చాహల్ విడదీశాడు.
ఆ తర్వాత వచ్చిన స్టీవ్స్మిత్ (12)ని కూడా చాహల్ ఔట్ చేయగా ప్రమాదకర మాక్స్వెల్ (2: 3
బంతుల్లో)ని నటరాజన్ బోల్తా కొట్టించాడు.
మిడిల్ ఓవర్లలో
హెన్రిక్యూస్ (30: 20 బంతుల్లో 1x4,
1x6) కాస్త ఫర్వాలేదనిపించినా.. అతనికి సరైన సహకారం
లభించలేదు. మాథ్యూవెడ్ (7), సీన్ అబాట్ (12),
మిచెల్ స్టార్క్ (1) దూకుడుగా ఆడే ప్రయత్నంలో
వికెట్ చేజార్చుకున్నారు.