Advertisement

  • తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన టీమిండియా ..పృథ్వీ షా డక్ అవుట్

తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన టీమిండియా ..పృథ్వీ షా డక్ అవుట్

By: Sankar Thu, 17 Dec 2020 10:27 AM

తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన టీమిండియా ..పృథ్వీ షా డక్ అవుట్


క్రికెట్ అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న భారత్-ఆసీస్ టెస్ట్ సిరీస్ నేడు ప్రారంభం అయ్యింది. ఈ మొదటి డే-నైట్ టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ.

అయితే ఈ మ్యాచ్ లో మిచెల్ స్టార్క్ వేసిన మొదటి ఓవర్ రెండో బంతికే భారత ఓపెనర్ పృథ్వీ షా(0) పెవిలియన్ కు చేరుకున్నాడు. దాంతో భారత్ పరుగుల ఖాతాను తెరవకముందే ఆసీస్ వికెట్ల ఖాతాను ప్రారంభంచింది ..అయితే నిన్న తుది జట్టును ప్రకటించినప్పుడే తీవ్ర విమర్శలు వచ్చాయి..పేలవ ఫామ్ లో ఉన్న పృథ్వీ షా ను జట్టులోకి తీసుకోవడంపై చాల మంది పెదవి విరిచారు ...అతడి స్తానంలో ఫామ్ లో ఉన్న గిల్ ను గాని , సీనియర్ అయిన రాహుల్ ని గాని తీసుకోవాలని అన్నారు ...

అయితే మరికొందరు మాత్రం షాకు మద్దతుగా నిలుస్తున్నారు...ఇంకా చాల చిన్న ఏజ్ లో ఉన్న షా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాడని , రోహిత్ , రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా కెరీర్ ఆరంభంలో తడబడినవారే అని అంటున్నారు..

Tags :
|
|
|

Advertisement