తొలి వన్డేలో భారత్ ఓటమి
By: chandrasekar Fri, 27 Nov 2020 10:02 PM
ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్
రాణించడంతో భారత బౌలర్లపై విరుచుకుపడి భారీ లక్ష్యాన్ని మనముందు ఉంచారు. భారత్
విజయ లక్ష్యంలో విఫలమైనది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ పోరాడి
ఓడింది. 375
పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి వరకు పోరాడి 66 పరుగుల
తేడాతో ఓటమి చవిచూసింది. కొండంత టార్గెట్ ఛేదించాల్సి ఉన్నా 101
పరుగలకే భారత్ 4 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(22), కెప్టెన్
విరాట్ కోహ్లీ(21), శ్రేయాశ్ అయ్యర్(2),
కేఎల్ రాహుల్ (12)లు వెంటవెంటనే అవుట్ కావడంతో భారత్ పీకల్లోతు
కష్టాల్లో పడింది. అయితే శిఖర్ ధవన్(74),
హార్దిక్ పాండ్యా(90) వీరోచితంగా పోరాడారు.
ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే జాంపా బౌలింగ్లో అనవసర షాట్కు
యత్నించి ధవన్ స్టార్క్కు చిక్కాడు. దీంతో వీరిద్దరి భారీ భాగస్వామ్యానికి
తెరపడింది. ఇక కొద్దిసేపటికే జాంపా బౌలింగ్లోనే హార్దిక్ కూడా లాంగాన్లో
స్టార్క్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఓటమి దాదాపు ఖరారైంది.
ఇక లెఫ్ట్ హ్యాండ్ చేతి
వాటం ఆటగాడు జడేజా(25) కూడా ఈ మ్యాచ్ లో రాణించలేకపోయాడు. ఒకే ఒక్క సిక్స్
కొట్టి జాంపా బౌలింగ్లోనే స్టార్క్కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక బౌలర్లు
నవదీప్ సైనీ(29 నాటౌట్), మహమ్మద్ షమి(13)
కొద్దిగా బ్యాట్ ఝుళిపించినా అప్పటికే ఓటమి
ఖరారైపోయింది. చివర్లో సైనీ, బూమ్రాలు క్రీజులో ఉన్నారు. నిర్ణీత 50
ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే
చేయగలిగింది. దీంతో విజయం ఆసీస్ సొంతమైంది. ఇదిలా ఉంటే తొలుత టాస్ గెలిచి
బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. మొదటి నుంచే
ఎదురు దాడి చేస్తూ బౌండరీల మోత మోగించింది. వార్నర్(69), ఫించ్(114), స్టీవ్ స్మిత్(105) భారత బౌలర్లను ఎడాపెడా బాదేశారు. ఇక చివర్లో మ్యాక్స్వెల్
ఫోర్లు, సిక్సులతో
విరుచుకుపడ్డాడు. కేవలం 19 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సులతో 45 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 50
ఓవర్లలో ఆస్ట్రేలియా 374 పరుగులు భారీ స్కోరు సాధించింది. భారత్ ఓపెనింగ్
ఆకట్టుకోలేక పోయింది.