Advertisement

  • గణతంత్ర వేడులకు చీఫ్ గెస్ట్ గా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ !

గణతంత్ర వేడులకు చీఫ్ గెస్ట్ గా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ !

By: Sankar Wed, 02 Dec 2020 5:02 PM

గణతంత్ర వేడులకు చీఫ్ గెస్ట్ గా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ !


ఇటీవల కాలంలో భారత గణతంత్ర వేడుకలకు ఇతర దేశాలకు చెందిన అధ్యక్షులు లేదా ప్రధానులు చీఫ్ గెస్ట్ లు గా వస్తున్నారు...ఈ సారి కూడా 2021 లో జరిగే గణతంత్ర వేడులకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది...

గ‌త నెల 27న ఆయ‌న‌తో జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. జాన్స‌న్‌ను ఆహ్వానించిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అదే స‌మ‌యంలో యూకేలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే జీ-7 స‌ద‌స్సుకు రావాల్సిందిగా మోదీని బోరిస్ జాన్స‌న్ ఆహ్వానించిన‌ట్లు తెలిపాయి.

రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌కు చివ‌రిసారి 1993లో అప్ప‌టి బ్రిట‌న్ ప్ర‌ధాని జాన్ మేజ‌ర్ ముఖ్య అతిథిగా వ‌చ్చారు. జాన్స‌న్‌తో ఫోన్ సంభాష‌ణ త‌ర్వాత మోదీ ట్వీట్ చేశారు. వ‌చ్చే ద‌శాబ్దంలో ఇండియా, యూకే సంబంధాల కోసం రోడ్ మ్యాప్‌పై చ‌ర్చించిట్లు ఆ ట్వీట్‌లో మోదీ వెల్ల‌డించారు.

Tags :
|
|

Advertisement