చెలరేగిన పాండ్య , జడేజా ...భారీ స్కోర్ సాధించిన ఇండియా
By: Sankar Wed, 02 Dec 2020 1:06 PM
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్ డే లో తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా భారీ స్కోర్ సాధించింది..పాండ్య , జడేజ , కోహ్లీ అర్థసెంచరీలతో రాణించడంతో యాబ్ ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది...ఈ ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే జడేజా మరియు పాండ్య భాగస్వామ్యం...
కెప్టెన్ కోహ్లీ అర్థసెంచరి చేసి అవుట్ అయినా తర్వాత టీం ఇండియా తక్కువ స్కోర్ కి పరిమితం అవుతుంది అనిపించింది ...కానీ జడేజా , పాండ్య 108 బంతుల్లో 159 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ముఖ్యంగా 47వ ఓవర్లో జడేజా ఆసీస్ బౌలర్ అబాట్కు చుక్కలు చూపించాడు. వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాది 43 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
మొత్తంగా 50 బంతులు ఎదుర్కొన్న జడ్డూభాయ్ 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. ఇక 76 బంతుల్లో ఏడు బౌండరీలు, ఒక సిక్స్తో పాండ్యా 92 పరుగులు సాధించాడు. వన్డే కెరీర్లో పాండ్యాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.