- హోమ్›
- వార్తలు›
- కోటి దాటినా కరోనా పరీక్షలు ..రోజుకు రెండు లక్షలకు పైగా చేస్తున్నట్లు వెల్లడించిన ఐసీఎంఆర్
కోటి దాటినా కరోనా పరీక్షలు ..రోజుకు రెండు లక్షలకు పైగా చేస్తున్నట్లు వెల్లడించిన ఐసీఎంఆర్
By: Sankar Mon, 06 July 2020 5:22 PM
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుంది ..లాక్ డౌన్ సమయంలో అంతగా కరోనా ప్రభావం లేకపోయినప్పటికీ , లొక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఒక్కసారిగా కరోనా తన ప్రతాపం చూయించసాగింది ..నెల రోజుల వ్యవధిలోనే ఇండియాలో కరోనా మహమ్మారి పల్లెలకు కూడా వ్యాపించింది ..దీనితో ప్రభుత్వాలు టెస్ట్ ల సంఖ్యను పెంచి , ఫలితాలను కూడా వేగంగా వచ్చేలా చూస్తున్నాయి ..ఇప్పటి వరకు దేశంలో కోటి కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎఎంఆర్) సోమవారం వెల్లడించింది.
ఈ రోజు ఉదయం 11 గంటల వరకు భారత్లో మొత్తం 1,00,04,101 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ లోకేష్ శర్మ పేర్కొన్నారు. అలాగే ఆదివారం ఒక్కరోజు 1,80,596 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 24,248 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. రోజుకు 2 లక్షల 15 వేల 655 శాంపిల్స్ చొప్పున పరీక్షించినట్లు, గడిచిన అయిదు రోజుల్లో పది లక్షల టెస్టులు చేసినట్లు ఆయన తెలిపారు..
దేశంలో మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల కోసం 1100 ల్యాబ్లకు ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది. వీటిలో 788 ప్రభుత్వ ల్యాబులు ఉండగా, 317 ప్రైవేటు ల్యాబులు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 61, తెలంగాణలో 36 కేంద్రాల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. కాగా దేశ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా టెస్టులు నిర్వహించిన రాష్ట్రాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. ఇక కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ ప్రపంచంలోనే మూడు స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. అమెరికా, బ్రెజిల్ మాత్రమే భారత్ కంటే ముందున్నాయి.