భారత్-చైనా దేశాల మధ్య ఏకాభిప్రాయం!
By: chandrasekar Thu, 11 June 2020 02:42 AM
భారత్, చైనా
సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల సడలింపునకు రెండు దేశాలు సానుకూల దృక్పథంతో
ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తున్నాయని చైనా వెల్లడించింది. తూర్పు లడఖ్లోని
ప్యాంగాంగ్ సరస్సు వద్ద మే 5న చైనా బలగాలు మోహరించడం ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది.
సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై జూన్ 6న
రెండు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారుల మధ్య భేటీ జరిగింది.
తూర్పు లడఖ్, ప్యాంగాంగ్
సెక్టార్లలోని చైనా బలగాలు వెనక్కు మళ్తున్నాయని, విరమణ ప్రక్రియ ప్రారంభమైందని
మంగళవారం భారత ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఈ క్రమంలోనే చైనా నుంచి
తాజా ప్రకటన వెలువడింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యుంగ్
మాట్లాడుతూ ఇటీవల చైనా, భారత్ సైనిక, దౌత్య అధికారుల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న
పరిస్థితులపై సంప్రదింపులు జరిగాయి.
ఇరువర్గాలు సానుకూల
ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఉద్రిక్త వాతావరణాన్ని సడలించడానికి రెండు వైపుల నుంచి
ఏకాభిప్రాయం కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయి అన్నారు.