ఎఫ్ఏవోలో భారత్ పాత్ర, భాగస్వామ్యం చరిత్రాత్మకం: మోదీ
By: chandrasekar Sat, 17 Oct 2020 6:09 PM
ఈ ఏడాది వరల్డ్ ఫుడ్
ప్రోగ్రామ్కు నోబెల్ శాంతి బహుమతి దక్కడం గొప్ప విషయని ప్రధాని మోదీ
అన్నారు. వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా ఆయన
మాట్లాడుతూ.. ఆహార సరఫరా విషయంలో భారత పాత్ర, భాగస్వామ్యం చరిత్రాత్మకమైందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పోషకాహారలోపాన్ని తొలగించడానికి నిరంతరం కృషి చేస్తున్న వారిని
అభినందిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. భారతదేశంలోని రైతులు, అన్నదాతలు, వ్యవసాయ
శాస్త్రవేత్తలు, అంగన్ వాడి-ఆశా కార్యకర్తలు పోషకాహార లోపానికి
వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నట్లు తెలిపారు. వీరందరి పరిశ్రమ వల్లే దేశం అన్నక్షేత్రంగా
వర్థిల్లుతున్నట్లు ఆయన అన్నారు. పేదల వద్దకు ప్రభుత్వం చేరడంలో వీరి సహకారం
ఎంతో ఉందన్నారు. కరోనా సంకట సమయంలోనూ రైతుల సహకారం వల్లే పోష్టికాహార
లోపంపై బలమైన పోరాటం చేశామన్నారు.
2014 తర్వాత దేశంలో కొత్త చరిత్ర ప్రారంభమైందని, సమగ్ర
విధానం రూపంలో ముందుకు సాగుతున్నట్లు ఆయన అన్నారు. 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఎఫ్ఏవో
ప్రకటించిందని, దానికి భారత మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. పోషకాహార సమస్యను అధిగమించేందుకు 17 రకాల
కొత్త వంగడాలను రిలీజ్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. చిన్న రైతులను బలోపేతం
చేయడానికి .. ఎఫ్పీవోల నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
మహిళల వివాహ వయసుకు
సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అయితే దీనిపై ఏర్పాటు
చేసిన కమిటీ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని దేశం నలుమూలల నుంచి ఆడ కూతుళ్లు
లేఖలు రాస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అయితే నివేదిక వచ్చిన వెంటనే పెళ్లి వయసుకు సంబంధించి చర్యలు
తీసుకొంటామని మోదీ చెప్పారు. ఐక్యరాజ్యసమితి
ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో)కు 75 ఏళ్లు
నిండాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ .. 75 రూపాయాల స్మారక నాణాన్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎనిమిది పంటలకు
సంబంధించిన 17 రకాల బయోఫోర్టిఫైడ్ వెరైటీలను కూడా జాతికి అంకితం
చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ ఫుడ్
డేను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.