తెలుగు రాష్ట్రాలలో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు
By: chandrasekar Fri, 14 Aug 2020 09:52 AM
విజయవాడ ఇందిరాగాంధీ
మున్సిపల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లు
రేపు విజయవాడ ఇందిరాగాంధీ
మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు భద్రతా ఏర్పాట్లను
పూర్తి చేశామని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ తెలిపారు.
కరోనా నేపథ్యంలో పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
కరోనా వల్ల ఈసారి
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కాస్త
ప్రత్యేకంగా జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోందో తెలుసుకుందాం. తెలంగాణ
ప్రభుత్వం కరోనా ఉన్నప్పటికీ స్వాతంత్ర్య దినోత్సవం జరపాలని డిసైడైంది. హైదరాబాద్తో
పాటూ మిగతా 32
జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో ఈ వేడుక జరగనుంది. రాష్ట్రవ్యాప్త వేడుక హైదరాబాద్లో
జరగనుంది. ఉదయం 10.30కి ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఇందుకు సంబంధించిన
పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఏ జిల్లాల్లో ఏ మంత్రులు
జెండా ఎగరవేయాలో ఓ ఆర్డర్ జారీ చేసిన ప్రభుత్వం జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఉదయం 10 గంటల
సమయంలో జెండా వందనం జరగాలని తెలిపింది. ఎమ్మెల్యేలు, మేయర్లు ఇతరతా అందరూ ఈ
కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించింది.