Advertisement

  • IND Vs AUS Sydney ODI: రెండో వన్డేలోనూ టీమిండియా ఘార పరాజయం...!

IND Vs AUS Sydney ODI: రెండో వన్డేలోనూ టీమిండియా ఘార పరాజయం...!

By: Anji Sun, 29 Nov 2020 7:07 PM

IND vs AUS Sydney ODI: రెండో వన్డేలోనూ టీమిండియా ఘార పరాజయం...!

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా ఘారపరాజయం పాలైంది. 390 పరుగల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి 338/9 పరుగులు మాత్రమే చేసి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది.

మూడు వన్డేల సిరీస్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓడిపోవడంతో సిరీస్ ఆసిస్ కైవసం అయ్యింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టీమ్.. నిర్ణీత 50 ఓవర్లలో 389/4 పరుగుల చేసి 390 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది.

భారీ లక్ష్య ఛేదనతో క్రీజ్‌లోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ భారత్‌కు ఓటమి తప్పలేదు.

Tags :

Advertisement