పెరిగిన తిరుమల వెంకన్న హుండీ ఆదాయం...
By: chandrasekar Wed, 16 Dec 2020 4:00 PM
కరోనా కారణంగా తిరుమల
వెంకన్న గుడి చాలా రోజులు దర్శనాలకు అనుమతి ఇవ్వలేదు. కరోనా ప్రభావం తగాదాతో శ్రీవారి దర్శనానికి అనుమతి
ఇచ్చారు. కరోనా ప్రభావంతో హుండీ ఆదాయం కాస్త తగ్గినా మళ్లీ ఆదాయం పెరుగుతోంది.
మంగళవారం శ్రీవారిని 33,783మంది భక్తులు దర్శించుకున్నారు. 11,491మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.3.23కోట్లు
ఆదాయం వచ్చింది. కరోనా ప్రభావంతో రెండు, మూడు నెలలుగా స్వామివారి హుండీ ఆదాయం తగ్గిపోయింది.
సర్వ దర్శనం టోకెన్లు
కూడా జారీ చేస్తుండటంతో భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో హుండీ ఆదాయం పెరిగే అవకాశం
ఉంది. లాక్డౌన్ తర్వాత హుండీ ఆదాయం ఇంత రావడం ఇదే మొదటిసారి. లాక్డౌన్, కరోనాతో కొన్ని నెలల పాటు తిరుమలలో భక్తులకు దర్శనం
నిలిపివేశారు. కరోనా కట్టడి కావడంతో పాటూ పరిస్థితుల్లో మార్పు రావడంతో తిరుమలకు
వెళ్లే భక్తుల సంఖ్య పెరుగడంతో ఆదాయం కూడా పెరుగుతూ ఉంది.