పెరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ మృతుల సంఖ్య
By: chandrasekar Wed, 03 June 2020 5:40 PM
విశాఖను గ్యాస్ దుర్ఘటన
విషాదం వీడటం లేదు. తాజాగా ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. స్టెరిన్ గ్యాస్ ప్రభావంతో యలమంచలి
కనకరాజు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు రోజులు చికిత్స పొందిన కనకరాజు
ఆరోగ్యం బాగానే ఉండటంతో ఇంటికి వెళ్లిపోయాడు. నిన్న తీవ్ర అస్వస్థతకు గురవడంతో
కనకరాజు మృతి చెందాడు. కనకరాజు మృతికి ఎల్జీ పాలిమర్స్ కంపెనీయే కారణమంటూ ఆయన
కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు.
చికిత్స అనంతం
ఒక్కొక్కరిగా మృతి చెందుతుండటంతో వెంకటపురం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు. గతంలో 12 మంది
మరణించగా, కొద్దిరోజుల క్రితం ఓ వృద్ధురాలు మరణించిన సంగతి
తెలిసిందే. తాజాగా స్టైరిన్ గ్యాస్ ప్రభావంతో యలమంచలి కనకరాజు మృతి చెందాడు.
జీవీఎంసీ 92వ
వార్డు వెంకటాపురం గ్రామానికి చెందిన యలమంచిలి కనకరాజు కార్పెంటర్గా
పనిచేస్తుండేవాడు. గత నెల 7వ
తేదీన జరిగిన గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సురక్ష
ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అనంతరం ఇంటికి వచ్చిన కనకరాజు సోమవారం తీవ్ర అస్వస్థతకు
గురవడంతో కనకరాజు మృతి చెందాడు.
ఈ విషయంలో ప్రభుత్వం ఎలా
స్పందిస్తుందో చూడాలి. మరోవైపు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రిటైర్డ్
జడ్జి శేషశయనా రెడ్డి కమిటీ తన నివేదికను ఎన్జీటీకి సమర్పించింది. సంస్థ
నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్
ఘటనపై జాతీయ హరిత టైబ్యునల్(ఎన్జీటీ)లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో రిటైర్డ్ జడ్జి శేషశయనా
రెడ్డి కమిటీ సమర్పించారు.
మానవ తప్పిదం, భద్రతా వైఫల్యం, సంస్థ
నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో తెలిపారు. మరోవైపు ఎల్జీ పరిశ్రమపై
ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఎల్జి పాలిమర్స్ పరిశ్రమ శాశ్వతంగా మూసివేయాలని
గాంధీ విగ్రహం వద్ద ధర్నా ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. 14మంది మరణానికి, వందలాదిమంది
అస్వస్థతకు గురిచేసిన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని వారు
డిమాండ్ చేశారు.