ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు పెంపు
By: chandrasekar Tue, 21 July 2020 12:21 PM
కరోనా వైరస్ను కట్టడి
చేసేందుకు విధించిన లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలలో నష్టాలు చోటు చేసుకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి సైతం భారీగా ఆదాయానికి గండిపడింది. అయినా కూడా ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం సంక్షేమ మంత్రాన్ని పాటిస్తూనే ఉన్నారు. ప్రజల
ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేస్తున్నారు.
ఓవైపు సంక్షేమ పథకాల అమలు, మరోవైపు
ఆదాయం తగ్గిపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్
ధరలపై వ్యాట్ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలుపై రూ. 1.24, డీజిల్పై 93 పైసలు వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు
ఏపీ వ్యాట్ 2005ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
పెట్రోల్పై 31 శాతం పన్నుతో పాటు రూ. 4 అదనపు
సుంకం, డీజిల్పై
22.25 శాతం
వ్యాట్తో పాటు రూ. 4 అదనంగా సుంకం విధించింది. లాక్డౌన్ కారణంగా రాష్ట్ర
ఆదాయం భారీగా పడిపోయిందని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ తెలిపారు.
గత ఏడాది ఏప్రిల్ నెలలో
రూ. 4,480
కోట్లుగా ఉన్న ఆదాయం. 29.5 శాతానికి తగ్గి రూ. 1,323 కోట్లకు పడిపోయిందని
వెల్లడించారు. జూన్ నెలలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని ఉత్తర్వులో పేర్కొన్నారు.
దీంతో పడిపోయిన రాష్ట్ర రెవెన్యూను పెంచుకోవడానికే ధరలు పెంచుతున్నామని భార్గవ్
తెలిపారు.