సుశాంత్ సింగ్ కేసులో మహేష్ భట్, కరణ్ మేనేజర్కు, హీరోయిన్ కంగనా రనౌత్కు సమన్లు
By: chandrasekar Mon, 27 July 2020 5:15 PM
బాలీవుడ్ నటుడు సుశాంత్
సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్లో కొందరు సినీ ప్రముఖులను ఇప్పటికే
విచారించారు పోలీసులు. ఈ క్రమంలోనే తాజాగా కరణ్ జోహార్ సొంత నిర్మాణ సంస్థ ధర్మా
ప్రొడక్షన్స్ సిఈవో అపూర్వ మెహతాకు ముంబై పోలీసులు సమన్లు పంపారు.విచారణకు హాజరు
కావాల్సిందిగా ఆయన్ని ఆదేశించారు.
ఇప్పటికే సుశాంత్
ఆత్మహత్య కేసులో విచారణకు హాజరుకావాలని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్కు, కరణ్
జోహోర్ మేనేజర్కు, హీరోయిన్ కంగనా రనౌత్కు బాంద్రా పోలీసులు నోటీసులు
పంపారు. ఇప్పుడు ధర్మ ప్రొడక్షన్స్ సీఈవోకు కూడా సమన్లు వెళ్లాయి. సుశాంత్
మరణించడానికి బాలీవుడ్లో పాతుకుపోయిన నెపోటిజం కారణమంటూ చాలా మంది ఇప్పటికే
ఆరోపించారు. ఇందులో కరణ్ జోహార్ పేరు అందరికంటే ముందు ఉంది. ఆయనే స్టార్ కిడ్స్ను
ప్రోత్సహిస్తున్నాడని అందరూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇప్పటికే సుశాంత్
ఆత్మహత్య కేసులో విచారణకు హాజరుకావాలని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్కు, కరణ్
జోహోర్ మేనేజర్కు, హీరోయిన్ కంగనా రనౌత్కు బాంద్రా పోలీసులు నోటీసులు
పంపారు. ఇప్పుడు ధర్మ ప్రొడక్షన్స్ సీఈవోకు కూడా సమన్లు వెళ్లాయి. సుశాంత్
మరణించడానికి బాలీవుడ్లో పాతుకుపోయిన నెపోటిజం కారణమంటూ చాలా మంది ఇప్పటికే
ఆరోపించారు. ఇందులో కరణ్ జోహార్ పేరు అందరికంటే ముందు ఉంది. ఆయనే స్టార్ కిడ్స్ను
ప్రోత్సహిస్తున్నాడని అందరూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.