గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 9,831 శాంపిల్స్
By: chandrasekar Sat, 06 June 2020 6:54 PM
గడిచిన 24
గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,831 శాంపిల్స్ను పరీక్షించగా 50
మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు మీడియా బులిటెన్లో వైద్య ఆరోగ్యశాఖ
తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 54మందికి విదేశాల నుంచి వచ్చిన మరో నలుగురికి కరోనా
నిర్థారణ అయ్యింది. ఈ మొత్తం కేసుల సంఖ్య 108 నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల
వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 3427కు
చేరాయి. మరో 21మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో
డిశ్చార్జ్ కాగా రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1060కు చేరింది.
రాష్ట్రవ్యాప్తంగా కర్నూలు జిల్లాలో 650కుపైగా కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 500కు
పైగా కేసులు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి
వరకు 2294మందికి
నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా
కరోనాతో మొత్తం 73మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల
ముగ్గురు చనిపోయారు.. కృష్ణా జిల్లాలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా
నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో
నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది.
విదేశాల నుంచి వచ్చిన
వారిలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. అలాగే విదేశాల నుంచి వచ్చిన 123మందికి
వైరస్ సోకినట్లు తెలియజేశారు. అయితే కోయంబేడు లింకులతో పాటూ విదేశాల నుంచి వచ్చిన
వారితో టెన్షన్ వెంటాడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగడం ఆందోళన
కలిగిస్తోంది. అందుకే ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు
నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు
సంబంధించిన కమ్యులేటివ్ పాజిటివ్ కేసులు 700
(వీటిలో యాక్టివ్ కేసులు 442) ఉన్నాయని
ప్రకటించారు.