Advertisement

  • తమిళనాడులో గడచిన 24 గంటల్లో కొత్తగా 5,795 పాజిటివ్ కేసులు

తమిళనాడులో గడచిన 24 గంటల్లో కొత్తగా 5,795 పాజిటివ్ కేసులు

By: chandrasekar Thu, 20 Aug 2020 09:31 AM

తమిళనాడులో గడచిన 24 గంటల్లో కొత్తగా 5,795 పాజిటివ్ కేసులు


దేశంలో అధిక కరోనా కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలలో తమిళనాడు ముఖ్యమైనది. తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. వాణిజ్య పరంగా ముఖ్య పాత్ర కలిగినటువంటి తమిళనాడులో గత పక్షం రోజులుగా ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి.

రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో గత మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,795 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 116 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,55,449కు, మరణాల సంఖ్య 6,123కు చేరింది.

అదేవిధంగా గడచిన 24 గంటల్లో 6,384 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 2,96,171 మంది కోలుకోగా ప్రస్తుతం 53,155 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వివరాలు అందించింది. ప్రభుత్వం ఎన్ని సూచనలు చేసిన ప్రజలు మాత్రమే తగు జాగ్రత్తలు తీసికొని కరోనా వ్యాప్తిని అరికట్టాలి.

Tags :

Advertisement