ఆ ఫైనల్లో ఓటమి నా గుండె బద్దలు అయ్యేలా చేసింది ..ఇమ్రాన్ తాహిర్
By: Sankar Thu, 30 July 2020 8:16 PM
గత ఏడాది జరిగిన ఐపీయల్ ఫైనల్ ఎంత మజా ఇచ్చిందో అందరికి తెలిసిందే ..చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఆ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చివరి బంతికి విజయం సాధించింది..అయితే ఆ మ్యాచ్ లో చివరి ఓవర్ వరకు విజయం దిశగా సాగిన చెన్నై , చివరి ఊఎవరిలో మలింగ విజృంభణతో ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది.. తాజాగా అప్పటి ఫైనల్లో ఓడిపోయిన చెన్నై జట్టులో సభ్యుడిగా ఉన్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మరోసారి ఆ మ్యాచ్ను గుర్తుచేసుకున్నాడు. అనిస్ సాజన్ నిర్వహించిన ఇన్స్టా లైవ్ చాట్లో పాల్గొన్న తాహిర్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
ఆ ఫైనల్ మ్యాచ్లో కేవలం ఒక్క పరుగుతో ఓడిపోవడం నా గుండెను బద్దలయ్యేలా చేసింది. ఎందుకంటే లీగ్లో మేము అప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లో గెలుచుకుంటే వచ్చాం. అందులో పెద్ద టీమ్స్ కూడా ఉన్నాయి... వాటిని కూడా రెండేసి సార్లు ఓడించాం. ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు జట్టుతో జర్నీ చేసిన నేను ఫైనల్లో కేవలం ఒక్కపరుగుతో ఓడిపోవడం జీర్ణించుకోలేకపోయా. మాకు టైటిల్ దూరం కావడానికి ఒక్క పరుగే తేడా.. కానీ ఆ ఒక్క పరుగే మమ్మల్ని టైటిల్కు దూరం చేసింది. మేం కష్టపడ్డాం.. గెలుపుకోసం ప్రయత్నించాం.అయినా గెలుపోటములు అనేది మన చేతిలో ఉండవు
నిజానికి ఆ మ్యాచ్ ఈజీగా గెలవాల్సింది..వాట్సన్ మంచి ఆరంభాన్నిచ్చాడు. శార్థుల్ ఠాకూర్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. కానీ లసిత్ మలింగ రూపంలో దురదృష్టం మమల్ని వెంటాడింది. మలింగ ఆరోజు ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒత్తిడిని తట్టుకొని మరీ బౌలింగ్ చేసి కేవలం ఒక్క పరుగుతో ముంబైకి టైటిల్ కట్టబెట్టాడు. నిజంగా ప్రపంచంలో మలింగ అత్యుత్తమ బౌలర్ అనడంలో సందేహం లేదు. కానీ ఏం చేస్తాం.. మాది కాని రోజు ఇలాగే ఉంటుంది అని ఆ క్షణంలో నాకు అనిపించింది' అంటూ పేర్కొన్నాడు.