చైనా నుంచి భారత్కు ఈ ఏడాది దిగుమతులు తగ్గగా...ఎగుమతులు పెరిగాయి...
By: chandrasekar Tue, 08 Dec 2020 3:57 PM
చైనా నుంచి భారత్కు ఈ
ఏడాది దిగుమతులు తగ్గగా భారత్ నుంచి చైనాకు మాత్రం ఎగుమతులు పెరిగాయి. ఓ వైపు
కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం, మరోవైపు తూర్పు లఢక్ సరిహద్దులో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు
కొనసాగినప్పటికీ 11 నెలల్లో భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 16 శాతం
పెరిగాయి. మరోవైపు అదే సమయంలో చైనా నుంచి భారత్కు దిగుమతులు 13 శాతం
తగ్గాయి.
ఈ మేరకు సోమవారం చైనా
కస్టమ్స్ డేటా వెల్లడైంది. దీని ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 59
బిలియన్ డాలర్ల ఉత్పత్తులు చైనా నుంచి భారత్కు ఎగుమతి అయ్యాయి. గత ఏడాది
ఎగుమతులతో పోల్చితే 13 శాతం మేర తగ్గుదల నమోదైంది.
మరోవైపు సరిహద్దు
వివాదాన్ని చైనా రాజకీయం చేయకపోవడం వల్లనే భారత్ నుంచి చైనాకు 19
బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయని ఆ దేశ మీడియా ప్రకటించింది. గతంతో
పోల్చితే భారత్కు ఎగుమతులు 16 శాతం పెరిగాయని పేర్కొంది. కాగా, కరోనా
వల్ల భారత్లో అంతర్గత డిమాండ్ తగ్గడం, ప్రభుత్వం ఆంక్షల నేపథ్యంలో చైనా నుంచి దిగుమతులు 13 శాతం
తగ్గాయని ‘గ్లోబల్ టైమ్స్’ తెలిపింది.
చైనా నుంచి భారత్
ఎక్కువగా ఆర్గానిక్ కెమికల్స్, ఎరువులు, యాంటీ బయోటిక్స్, అల్యుమినియం ఫోయిల్ను దిగుమతి చేసుకున్నది. మరోవైపు
భారత్ నుంచి చైనాకు ముడి ఇనుము, ముడి డైమాండ్స్, కాటన్, గ్రానైట్ స్టోన్, చేపలు వంటివి ఎక్కువగా
ఎగుమతి అయ్యాయి.