Advertisement

విరాట్ పరుగుల దాహం తీరదు ..శ్రేయాస్ అయ్యర్

By: Sankar Wed, 10 June 2020 2:18 PM

విరాట్ పరుగుల దాహం తీరదు ..శ్రేయాస్ అయ్యర్

మైదానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటాడు. దాంతో.. సహచరులు సైతం కోహ్లీని ఫాలో అయిపోతున్నారు. కానీ.. విరాట్ కోహ్లీ పరుగుల దాహం, గెలుపు కాంక్ష ఎప్పటికీ తీరనిదని మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు. టీమ్‌లోని యువ క్రికెటర్లకి కోహ్లీ ఓ రోల్‌ మోడల్‌ అని చెప్పుకొచ్చిన శ్రేయాస్.. ప్రత్యర్థిపై ఏమాత్రం అతను జాలి చూపడని కితాబిచ్చాడు. గత ఏడాది నుంచి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ నెం.4లో శ్రేయాస్ అయ్యర్ నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

virat kohli,shreyas ayyar,indian cricket,batting,role model , విరాట్ కోహ్లీ , పరుగుల దాహం, గెలుపు కాంక్ష,   రోల్‌ మోడల్‌ ,  శ్రేయాస్ అయ్యర్

విరాట్ కోహ్లీ నుంచి ఏదైనా ప్రశంస అందుకుంటే.. ఆ ఫీలింగ్‌ మాటల్లో వర్ణించలేం. అతను నిజమైన నాయకుడు.. యువ క్రికెటర్లకి ఓ రోల్ మోడల్. ఇంకా చెప్పాలంటే.. కోహ్లీ ఓ సింహంలాంటోడు.. అతని ఆకలి ఎప్పటికీ తీరదు. మైదానంలోకి వెళ్లే ప్రతిసారి.. ఫస్ట్ మ్యాచ్ తరహాలో కసిగా ఆడుతూ.. ప్రత్యర్థిపై విరుచుకుపడుతుంటాడు. అతని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అని శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు.

భారత్ జట్టులో గత ఏడాది చివరి నుంచి శ్రేయాస్ అయ్యర్ రెగ్యులర్‌ ఆటగాడిగా కనిపిస్తున్నాడు. కానీ.. ఐపీఎల్‌లో అతను ఇప్పటికే ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్‌ని కెప్టెన్‌‌గా నడిపిస్తున్నాడు. 2019 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌కి చేరిన విషయం తెలిసిందే.

Tags :

Advertisement