పేటీఎం ఎలాంటి చార్జీలు లేకుండా డబ్బు బదిలీ చేయాలి అనుకుంటే...?
By: chandrasekar Mon, 19 Oct 2020 3:38 PM
మీరు పేటీఎం
వినియోగదారులైతే ఇకపై క్రెడిట్ కార్డు వాడి పేటీఎం వ్యాలెట్ లో మీరు డబ్బు
ట్రాన్ఫర్ చేస్తే 2 శాతం క్రెడిట్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో
రూ.10,000 కన్నా ఎక్కువ నగదును క్రెడిట్ కార్డు నుంచి వ్యాలెట్ లోకి బదిలీ చేస్తే ఈ
చార్జీలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ లిమిట్ ఎత్తివేశారు.
చార్జీలు లేకుండా...
క్రెడిట్ కార్డు
వినియోగించి నగదు లావాదేవీలు జరిపినప్పుడు బ్యాంకులకు పేటీఎం చార్జీలు చెల్లిస్తుంది
అని.
అందుకే ఈ నామ మాత్రపు
చార్జీలు వేస్తున్నాం అని పేర్కొంది పేటీఎం. అయితే ఎలాంటి చార్జీలు లేకుండా డబ్బు
బదిలీ చేయాలి అనుకుంటే మాత్రం యూపీఐ ( UPI
) లేదా డెబిట్ వాడమని సంస్థ సలహా ఇస్తోంది.
వినియోగదారులు తమ
క్రెడిట్ కార్డు నుంచి పేటీఎం వ్యాలెట్ లో మనీ ట్రాన్ఫర్ చేసినప్పుడు తాము
చార్జీలను బ్యాంకులకు చెల్లించేవాళ్ల౦. కానీ, ఇప్పుడు ఈ చార్జీలను వినియోగదారులకు బదిలీ
చేస్తున్నాం అని తెలిపింది.
వినియోగదారులకు ఊరట కల్పించడానికి వ్యాలెట్
నుంచి బ్యాంకు ఖాతాలోకి నగదు మార్చే సమయంలో విధించే 5 శాతం
చార్జీలను రద్దు చేశాం అని పేర్కొంది.