దుర్గా పూజ వద్దన్నట్లు నిరూపిస్తే మమత 101 గుంజీలు తీస్తారట!
By: chandrasekar Wed, 09 Sept 2020 2:08 PM
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా
బెనర్జీ ఈ ఏడాది దుర్గా పూజ వద్దని తాను అన్నట్లుగా నిరూపిస్తే ప్రజల ముందు 101
సార్లు గుంజీలు తీస్తానని అన్నారు. దీనిపై ఒక రాజకీయ పార్టీ వదంతులు
వ్యాపిస్తున్నదని ఆమె ఆరోపించారు.
కోల్కతాలో దసరా
నేపథ్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే
దుర్గా పూజపై ఇప్పటి వరకు ఎలాంటి సమావేశం జరుగలేదని, ఎలాంటి నిర్ణయం
తీసుకోలేదని మమత అన్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి దుర్గా పూజను రద్దు చేయాలని తమ
ప్రభుత్వం నిర్ణయించినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని ఆమె అన్నారు.
ఒక రాజకీయ పార్టీ
దురుద్దేశంతో దీనిపై తప్పుడు వదంతులు ప్రచారం చేస్తున్నదని, ప్రజలు
వాటిని నమ్మవద్దని మమత కోరారు. పోలీస్ డే సందర్భంగా మంగళవారం నిర్వహించిన ఆన్లైన్
కార్యక్రమంలో మాట్లాడిన ఆమె పరోక్షంగా బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసారు.