బీజేపీ నన్ను అరెస్ట్ చేసినా అఖండ విజయం సాధిస్తా...
By: chandrasekar Wed, 25 Nov 2020 9:04 PM
బీజేపీ తనను అరెస్ట్
చేసినా జైలు నుంచే అఖండ విజయం సాధించి చూపిస్తానని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
బీజేపీ కేవలం రాజకీయ పార్టీయే కాదని, అదో అబద్ధాల పుట్ట అని ఆమె ఆరోపించారు.
తృణమూల్ కాంగ్రెస్
ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని చూస్తోందని, వచ్చే ఎన్నికల్లో
బీజేపీయే అధికారికంలోకి వస్తుందని కొందరు జంప్ అవుతున్నారని పేర్కొన్నారు.
‘‘బీజేపీ కేవలం ఓ పార్టీయే కాదు. అదో అబద్ధాల పుట్ట. ఎప్పుడు ఎన్నికలొస్తే...
అప్పుడు నారదా శారదా స్కాంను బయటికి లాగుతారు.
ఒక్కటి మాత్రం స్పష్టం
చేయాలనుకుంటున్నా. బీజేపీ, దాని సంస్థలకు భయపడే ప్రసక్తే లేదు. వారు నన్ను
అరెస్ట్ చేసి, జైలుకు పంపినా... జైలు నుంచే ఎన్నికల్లో పోరాడతా.
తిరిగి అఖండ విజయాన్ని సాధిస్తా.’’ అని మమతా బెనర్జీ ప్రకటించారు.
లాలూ ప్రసాద్ యాదవ్ను
జైల్లో పెట్టినా, ఆర్జేడీ మంచి ఫలితాలనే సాధించిందని, బిహార్
లో బీజేపీ విజయం ప్రజాదరణ వల్ల వచ్చిన విజయం కాదని మమతా బెనర్జీ చురకలంటించారు.