ఆగస్టు 15 కల్లా కరోనా వ్యాక్సిన్ను లాంచ్ చేయాలని చూస్తున్న ఐసీఎంఆర్
By: chandrasekar Sat, 04 July 2020 2:55 PM
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా
ప్రబలంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా
వ్యాక్సిన్ పరీక్షలు జరుగుతున్నాయి.
హైదరాబాద్కు చెందిన
భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది. ఆ సంస్థ ఇప్పటికే
మానవ ట్రయల్స్ స్టార్ట్ చేసింది.
అయితే ట్రయల్స్ ప్రక్రియను
వేగవంతం చేయాలని భారత్బయోటెక్ సంస్థను ఐసీఎంఆర్ కోరినట్లు తెలుస్తోంది. ఆ ఫలితాల ఆధారంగా ఆగస్టు 15 కల్లా
కరోనా వ్యాక్సిన్ను లాంచ్ చేయాలని ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్
భారత్బయోటెక్ సంస్థకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
ఐసీఎంఆర్ అధికారులు ఈ లేఖపై
తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. అది
కేవలం ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే రాసిన లేఖ అని ఐసీఎంఆర్ వర్గాలు
పేర్కొన్నాయి.