Advertisement

  • ఆగ‌స్టు 15 క‌ల్లా క‌రోనా వ్యాక్సిన్‌ను లాంచ్ చేయాల‌ని చూస్తున్న ఐసీఎంఆర్

ఆగ‌స్టు 15 క‌ల్లా క‌రోనా వ్యాక్సిన్‌ను లాంచ్ చేయాల‌ని చూస్తున్న ఐసీఎంఆర్

By: chandrasekar Sat, 04 July 2020 2:55 PM

ఆగ‌స్టు 15 క‌ల్లా క‌రోనా వ్యాక్సిన్‌ను లాంచ్ చేయాల‌ని చూస్తున్న ఐసీఎంఆర్


కరోనా మహమ్మారి ప్ర‌పంచవ్యాప్తంగా ప్రబలంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌ కోసం ప్ర‌పంచవ్యాప్తంగా వ్యాక్సిన్ పరీక్షలు జ‌రుగుతున్నాయి.

హైద‌రాబాద్‌కు చెందిన‌ భార‌త్ బ‌యోటెక్ ఫార్మా సంస్థ వ్యాక్సిన్ త‌యారీలో నిమ‌గ్న‌మైంది. ఆ సంస్థ ఇప్ప‌టికే మాన‌వ ట్ర‌య‌ల్స్ స్టార్ట్ చేసింది.

అయితే ట్ర‌య‌ల్స్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని భార‌త్‌బ‌యోటెక్ సంస్థ‌ను ఐసీఎంఆర్ కోరిన‌ట్లు తెలుస్తోంది. ఆ ఫ‌లితాల ఆధారంగా ఆగ‌స్టు 15 క‌ల్లా క‌రోనా వ్యాక్సిన్‌ను లాంచ్ చేయాల‌ని ఐసీఎంఆర్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ బ‌ల‌రామ్ భార్గ‌వ్ భార‌త్‌బ‌యోటెక్ సంస్థ‌కు లేఖ రాసిన‌ట్లు తెలుస్తోంది.

ఐసీఎంఆర్ అధికారులు ఈ లేఖ‌పై త‌మ అభిప్రాయాల్ని వెల్ల‌డించారు. అది కేవ‌లం ఇంటర్న‌ల్ క‌మ్యూనికేష‌న్ కోసం మాత్ర‌మే రాసిన లేఖ అని ఐసీఎంఆర్ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

Tags :
|
|
|

Advertisement