టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే టీం ఇండియా .
By: Sankar Wed, 26 Aug 2020 7:47 PM
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్లో నెం.1 స్థానాన్ని భారత్ కాపాడుకోగలిగింది. ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య మూడు టెస్టుల సిరీస్ మంగళవారం ముగియగా.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం టెస్టు ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్ని ప్రకటించింది. ఈ పట్టికలో 360 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. ఆస్ట్రేలియా 296 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
పాకిస్థాన్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో ఒక మ్యాచ్లో గెలిచి.. రెండింటిని డ్రాతో సరిపెట్టిన ఇంగ్లాండ్ టీమ్.. 292 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక న్యూజిలాండ్ 180 పాయింట్లతో నాలుగులో నిలవగా.. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్లో తేలిపోయిన పాకిస్థాన్ పేలవంగా 166 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టింది.
రెండేళ్ల ఈ ఛాంపియన్షిప్లో ఆఖరిగా టాప్-2లో నిలిచిన జట్ల మధ్య 2021 జూన్ నెలలో ఫైనల్ జరగనుంది. ఆ ఫైనల్ మ్యాచ్లో గెలిచిన జట్టు టెస్టు ఛాంపియన్గా నిలవనుంది. ప్రతి టెస్టు సిరీస్కి ఐసీసీ 120 పాయింట్లు కేటాయిస్తుండగా.. సిరీస్లోని మ్యాచ్ల ఆధారంగా ఆ పాయింట్లని విభజిస్తారు. ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య సిరీస్లో మూడు టెస్టులు జరగడంతో.. ప్రతి మ్యాచ్కీ 40 పాయింట్లని కేటాయించారు.