Advertisement

  • ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెట్ జట్లలో భారత ఆటగాళ్ల హవా

ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెట్ జట్లలో భారత ఆటగాళ్ల హవా

By: Sankar Sun, 27 Dec 2020 5:18 PM

ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెట్ జట్లలో భారత ఆటగాళ్ల హవా


ఈరోజు ట్విట్టర్ వేదికగా మూడు ఫార్మాట్లలో ''ఐసీసీ టీం ఆఫ్ ది డికెడ్'' ను ప్రకటించింది. అయితే ఇందులో భారత ఆటగాళ్లదే పై చేయి అని చెప్పాలి. ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇందులో మూడు జట్లలో ఎంపిక కావడం మాత్రమే కాకుండా టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా నిలిచాడు.

అయితే ఈ లాంగ్ ఫార్మటు లో మరో భారత ఆటగాడు అశ్విన్ చోటుసంపాదించాడు. ఇక వన్డే అలాగే టీ20 జట్లకు కెప్టెన్ గా ధోని ఎన్నికవగా... వన్డేల్లో రోహిత్ శర్మ, కోహ్లీ ఎంపికయ్యారు. వీరితో పాటుగా పొట్టి ఫార్మాట్ లో బుమ్రా కూడా చోటు దక్కించుకున్నాడు..

అయితే పాకిస్తాన్ జట్టు నుంచి కనీసం ఒక్క ఆటగాడు కూడా ఏదయినా ఒక్క ఫార్మటు లో కూడా ఈ దశాబ్దపు అత్యుత్తమ జట్టులో సెలెక్ట్ కాలేదు..ఒకప్పుడు అత్యుత్తమ జట్లలో ఒకటయిన పాకిస్తాన్ గత కొంతకాలంగా సరయిన ఆటగాళ్లను అందించలేకపోతుంధీ..

Tags :
|
|
|
|

Advertisement