Advertisement

  • టి ట్వంటీ వరల్డ్ కప్ వాయిదా వేస్తారా ..? నిర్ణయం తేలేది నేడే ..

టి ట్వంటీ వరల్డ్ కప్ వాయిదా వేస్తారా ..? నిర్ణయం తేలేది నేడే ..

By: Sankar Mon, 20 July 2020 07:44 AM

టి ట్వంటీ వరల్డ్ కప్ వాయిదా వేస్తారా ..? నిర్ణయం తేలేది నేడే ..



ప్రపంచ క్రికెట్లో కరోనా కారణంగా ఎన్నో టోర్నీలు వాయిదా పడ్డాయి కానీ ఆస్ట్రేలియాలో ఈ ఏడాది చివర్లో జరిగే టి ట్వంటీ ప్రపంచకప్ వాయిదా మాత్రం ఎటు తేలడం లేదు ..ప్రపంచ కప్ వాయిదా పడితే ఐపీయల్ నిర్వహించాలని చూస్తున్న బీసీసీఐ ..టి ట్వంటీ ప్రపంచ కప్ వాయిదా న్యూస్ కోసం ఎదురు చూస్తుంది ..మెగా ఈవెంట్‌ వాయిదాపై నేడు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నుంచి స్పష్టమైన నిర్ణయం వస్తుందని బోర్డు ఆశిస్తోంది.

రెండు నెలలుగా పలుమార్లు సమావేశమైన ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఏ నిర్ణయం తీసుకోకుండానే నాన్చుతూ వచ్చింది. కానీ ఇంతలోపే ఆతిథ్య ఆస్ట్రేలియా తమ దేశం లో మెగా ఈవెంట్‌ నిర్వహించే పరిస్థితి లేదని చెప్పేసింది. దీంతో ఐసీసీ వాయిదా ప్రకటన తప్ప చేయగలిందేమీ లేదు. సోమవారం జరిగే సమావేశంలో ఈ నిర్ణయం వెలువడితే ఆ మెగా ఈవెంట్‌ షెడ్యూల్‌ సమయాన్ని ఐపీఎల్‌–13కు అనుకూలంగా మార్చుకోవాలని బీసీసీఐ ప్రణాళికతో ఉంది.

షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు ఆసీస్‌లో ప్రపంచకప్‌ ఈవెంట్‌ జరగాలి. ఇప్పుడీ సమయంలో ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బోర్డు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వేదికను కూడా సిద్ధం చేసుకుంది. కుదించైనా సరే లీగ్‌ను ముగించాలనే పట్టుదలతో ఉంది. ఈ విషయాన్ని బోర్డు అధ్యక్షుడు గంగూలీ స్పష్టంగా చెప్పాడు కూడా! ఈసారి ఐపీఎల్‌ విదేశాల్లోనే జరుగుతుందని ‘దాదా’ ఇదివరకే స్పష్టతనిచ్చాడు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నుంచి ఆసియా కప్‌ రద్దు ప్రకటనను ఇప్పించాడు. ఇవన్నీ కూడా ఐపీఎల్‌ తంతు కోసమే! ఈసారి లీగ్‌ జరగకపోతే బోర్డుకు రూ. 4000 కోట్ల నష్టం వస్తుంది.

ఇక టి20 మెగా ఈవెంట్‌పై అధికారిక ప్రకటన వస్తే మా తదుపరి కార్యాచరణ ఉంటుంది. మా ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలంటే ఐసీసీ ప్రకటన రావాలి’ అని అన్నారు. నేడు జరిగే ఐసీసీ సమావేశంలో స్వతంత్ర చైర్మన్‌ ఎన్నికపై కూడా చర్చించే అవకాశముంది అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు అన్నారు ..

Tags :
|
|
|

Advertisement