డాక్టర్ కావాలనుకున్న నేను ఇపుడు నటనతో మీ ముందుకు:
By: chandrasekar Wed, 28 Oct 2020 1:46 PM
హర్యానా సోయగం మానుషి
ఛిల్లార్ 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుని ఇండియాకు
పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. ఈ మోడల్ అక్షయ్ కుమార్ తో కలిసి పృథ్విరాజ్ చిత్రంతో
సిల్వర్ స్క్రీన్ కు పరిచయం కానుంది.
ప్రస్తుతం ఈ చిత్రం
షూటింగ్ జరుపుకుంటోంది. మానుషి ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. తన
స్వస్థలం హర్యానాను విడిచిపెట్టి ముంబైకి రావడం కొత్త అనుభూతి అని తెలిపింది.
నేను డాక్టర్ కావాలనుకున్నా.
అందాల పోటీల్లో పాల్గొనేకంటే ముందు ఒక్కసారి కూడా ముంబైకి రాలేదు. కొన్నేళ్ల
ముందు ముంబై నాకు కొత్త. సిటీలో నాకు ఎవ్వరూ తెలియదు. కానీ ఇపుడు ముంబైను నా
హోమ్ టౌన్ గా మారింది.
మూడేళ్లలో ముంబైతో
ఇలాంటి అనుబంధం ఏర్పడటం మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. డాక్టర్ కావాలనుకున్న
నేను..సంబంధం లేని రంగంలోకి వచ్చి ఇపుడు నటనతో మీ ముందుకు రాబోతున్నానని
చెప్పుకొచ్చింది.