Advertisement

కరోనా నెగటివ్ వచ్చింది కానీ ...ఉపాసన

By: Sankar Wed, 30 Dec 2020 10:55 AM

కరోనా నెగటివ్ వచ్చింది కానీ ...ఉపాసన


దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. నిన్న మెగా ఫ్యామిలీ హీరోలు రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌ వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించిన విషయం తెలిసిందే.

తనకు వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని, తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. త్వరలోనే కోలుకుని బలంగా తిరిగి వస్తాను అంటూ రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు. కొద్దిరోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని రామ్‌చరణ్ కోరారు. రామ్‌చరణ్‌ కరోనా బారినపడ్డ తర్వాత కొద్ది సేపటికే వరుణ్‌ తేజ్‌ వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు.

ఇద్దరు మెగా హీరోలు గంటల వ్యవధిలోనే కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మెగా అభిమానులకు ఆందోళనకు గురయ్యారు. అభిమానులు సహా ఇండస్ట్రీ హీరోలు కూడా వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల చేసిన ట్వీట్‌ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చరణ్‌కు పాజిటివ్‌ వచ్చిన తర్వాత తాను కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నానని.. నెగెటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. కానీ, తనకు మళ్లీ పాజిటివ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు...

Tags :
|
|

Advertisement