Advertisement

  • మా జట్టు పరిస్థితి చూసి నాకు కోపం వచ్చింది ..క్రిస్ గేల్

మా జట్టు పరిస్థితి చూసి నాకు కోపం వచ్చింది ..క్రిస్ గేల్

By: Sankar Mon, 19 Oct 2020 3:16 PM

మా జట్టు పరిస్థితి చూసి నాకు కోపం వచ్చింది ..క్రిస్ గేల్


కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల, డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ అనేక మలుపులు తిరిగి , ఫలితం తేలడానికి రెండు సూపర్ ఓవర్లు అవసరం అయ్యాయి...అయితే చివరకు కింగే ఎలెవన్ పంజాబ్ జట్టును విజయం వరించింది..

అసలు అయితే ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ కంటే ముందే కింగ్స్ ఎలెవన్ జట్టు సునాయాసంగా గెలవాల్సింది..కానీ ఈ ఏడాది గెలిచే మ్యాచ్ లను చేతులారా ఓడిపోవడం అలవాటు చేసుకున్న పంజాబ్ సరిగ్గా ఈ మ్యాచ్ లో కూడా అలాగే చేసింది..గెలిచే మ్యాచ్ న చేతురల టై చేసుకుంది..

అందుకే మ్యాచ్ అనంతరం గేల్ మాట్లాడుతూ... నేను రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ కు వెళ్తున్నపుడు ఒత్తిడి లేదు. కానీ నాకు కోపం వచ్చింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ లో తమ జట్టు ఆ పరిస్థితుల్లో చూసి కోపం వచ్చింది అన్నాడు. అలాగే మొదటి సూపర్ ఓవర్లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేసాడు. 5 పరుగుల లక్ష్యాన్ని కాపాడటం అంత సులభం కాదు అని ఈ యూనివర్స్ బాస్ తెలిపాడు.

Tags :

Advertisement