Advertisement

ధోనీ లేకపోయినా సత్తా చాటగలను ..కుల్దీప్ యాదవ్

By: Sankar Wed, 17 June 2020 10:31 AM

ధోనీ లేకపోయినా సత్తా చాటగలను ..కుల్దీప్ యాదవ్



మైదానంలో వికెట్ల వెనుక నుంచి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఫుట్‌వర్క్‌ని నిశితంగా పరిశీలించే మహేంద్రసింగ్ ధోనీ.. బౌలర్‌కి చక్కటి సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. అలా అతని నుంచి హెల్ప్ తీసుకుని ఇటీవల సక్సెస్ అయిన బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కూడా ఒకడు. కానీ..అయితే గత ప్రపంచ కప్ నుంచి ధోని టీమిండియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే ..దీనితో కుల్దీప్ ఆశించినంత మేర రాణించలేకపోతున్నాడు..

ధోనీ గైర్హాజరీ మీ బౌలింగ్‌పై ప్రభావం చూపుతోందా..? అని కుల్దీప్ యాదవ్‌ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. ‘‘నేను ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అలానే ధోనీపై నేను అతిగా ఆధారపడ్డాను అని చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం నా బౌలింగ్‌ని మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. అయితే.. ధోనీ మైదానంలో ఉంటే వికెట్ల వెనుక నుంచి నాకు మార్గనిర్దేశనం చేసేవాడు. ఎందుకంటే.. అతను వికెట్ కీపర్ కాబట్టి. బ్యాట్స్‌మెన్ కదలికలు అందరికంటే కీపర్‌కే బాగా తెలుస్తాయి’’ అని కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు.

2017లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కుల్దీప్ యాదవ్ ఇప్పటి వరకూ 6 టెస్టులు, 60 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో ఇప్పటికే 167 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. వన్డేల్లో రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు.



Tags :
|
|

Advertisement