Advertisement

  • సినీ పెద్దల సమావేశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలయ్య

సినీ పెద్దల సమావేశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలయ్య

By: Sankar Thu, 28 May 2020 3:22 PM

సినీ పెద్దల సమావేశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలయ్య

లాక్ డౌన్ లో దశల వారీగా అన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తుండటంతో సినిమా షూటింగ్ లకు కూడా పర్మిషన్ ఇవ్వాలని చిరంజీవి నాయకత్వంలో సినీ పెద్దలు తెలంగాణ ప్రబుత్వంతో సంప్రదింపులు జరిపారు ..ఆ సమావేశాలకు నాగార్జున , త్రివిక్రమ్ , రాజమౌళి వంటి పెద్దలు హాజరు అయ్యారు ..అయితే బాలయ్య బాబు ఆ సమావేశాల్లో ఎక్కడ కనిపించలేదు..తాజాగా బాలకృష్ణ మాట్లాడుతు సినీ పెద్దలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదన్నారు. పత్రికలు, మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు. లాక్‌డౌన్‌తో సినీ పరిశ్రమ కష్టాలు పడుతోందన్నారు. షూటింగ్‌లు త్వరలో ప్రారంభమైతే మంచిదన్నారు. తక్కువ మంది సిబ్బందితో, భౌతిక దూరం పాటిస్తూ షూటింగ్‌లు జరుపుకోవాల్సి ఉంటుందన్నారు.

అయితే ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అటు టాలీవుడ్‌లోనూ ఈ విషయంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో సినీ పెద్దలు బాలయ్యను పట్టించుకోవడం లేదని, సినీ ఇండస్ట్రీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ తాజాగా‌ స్పందించారు.

ప్రస్తుతం నిర్మాతలుగా మేము చిత్రీకరణ కోసం ప్రభుత్వంతో సంప్రదిస్తున్నాము. బాలకృష్ణ ఇప్పుడు నిర్మాతగా ఏ సినిమా చేయడం లేదు. అవసరమైనప్పుడు బాలయ్య మాతో చర్చల్లో పాల్గొంటారు. ఇప్పటివరకు జరిగిన ప్రతీ విషయాన్ని బాలయ్యకు నేనే స్వయంగా చెప్పాను. ఇండస్ట్రీ అంతా ఒక్కటే, ఇక్కడ ఎలాంటి గ్రూపులు లేవు. ఇండస్ట్రీలో ఎవరికి ఉండే గౌరవం వారికి ఉంది’ అంటూ సి. కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఇక సినీ పరిశ్రమకు సంబంధించిన షూటింగులకు అనుమతి ఇవ్వాలని టాలీవుడ్‌ ప్రముఖులు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సినీ పెద్దలు సమావేశమైన విషయం తెలిసిందే.

Tags :

Advertisement